కరోనా బారిన.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్

X
By - kasi |24 Oct 2020 6:28 PM IST
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి బీహార్ ఎన్నికల ఇన్ఛార్జి దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ట్వీట్ చేసి స్పష్టం చేశారు ఫడ్నవిస్. తనతో పరిచయం ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఫడ్నవీస్ సూచించారు. కాగా అంతకుముందు బీహార్కు చెందిన ముగ్గురు అగ్ర బిజెపి నాయకులు, డిప్యూటీ సిఎం సుశీల్ కుమార్ మోడీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, షహనావాజ్ హుస్సేన్ కూడా వ్యాధి బారిన పడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com