కేరళలో కోవిడ్.. 90 % కేసులు అక్కడే
దేశంలో కోవిడ్ మళ్లీ జడలు విప్పుతోంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నవంబర్లో రాష్ట్రంలో 479 కేసులు నమోదు కాగా, ఈ నెల మొదటి ఎనిమిది రోజుల్లో 825 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో 90% కంటే ఎక్కువ కొత్త కోవిడ్ కేసులకు కేరళ రాష్ట్రం వేదికగా నిలిచింది. నవంబర్లో ఒక రోగి చనిపోగా, ఈ నెలలో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు.
సోకిన వ్యక్తులకు లక్షణాలు రెండు నెలల వరకు ఉంటాయి కానీ మరణం చాలా అరుదుగా సంభవిస్తుంది. అందువలన భయపడాల్సిన అవసరం లేదు.. అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదని చెబుతున్నారు వైద్యులు.
అయితే, కోవిడ్ కంటే వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా లక్షణాలు తీవ్రమవుతున్నాయని రాజగిరి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సన్నీ పి ఒరాథెల్ అన్నారు. "ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, మెజారిటీ రోగులలో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com