Accident: చౌటుప్పల్ వద్ద ఢీకొన్న బస్సులు..
![Accident: చౌటుప్పల్ వద్ద ఢీకొన్న బస్సులు.. Accident: చౌటుప్పల్ వద్ద ఢీకొన్న బస్సులు..](https://www.tv5news.in/h-upload/2023/01/12/873516-.webp)
గురువారం తెల్లవారుఝామున జాతీయ రహదారి 65 పై ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు ఢీ కొనడంతో 11 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం చౌటుప్పల్ మండలం గుండ్ల పల్లి సమీపంలో చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న మైత్రి ట్రావెల్స్ బస్సును వెనక నుంచే వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సులను పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com