బాలుడిని ముక్కలుచేసి తినేసిన మొసలి

బాలుడిని ముక్కలుచేసి తినేసిన మొసలి
మొసలిని కొట్టి కొట్టి చంపేసిన గ్రామస్థులు

బీహార్‌లోని వైశాలిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో నీటికోసం దిగిన చిన్నారిపై మొసలి దాడికి పాల్పడింది. బాలుడిని చంపి తినేసింది. ఈ ఘటనలో కోపోద్రిక్తులైన చిన్నారి బంధువులు, గ్రామస్తులు మొసలిని నదిలో నుంచి బయటకు తీసి చంపారు. .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ పూర్ నివాసి ధర్మేంద్ర దాస్ ఒక కొత్త మోటార్ సైకిల్ కొనుగోలు చేశాడు. కుటుంబమంతా పవిత్రంగా గంగా నదిలో స్నానమాచరించి, గంగా ఒడ్డున బండికి పూజ చేయాలని భావించారు. ఇందుకోసం వైశాలి జిలాలో గంగా నది ఉన్న ఖాల్సా ఘాట్‌కు చేరుకున్నారు. ధర్మేంద్ర దాస్ కుటుంబం నది సమీపంలోనే ఉండగా నీళ్లు తీసుకువద్దామని కాస్త లోపలికి నాలుగు అడుగులు వేసిన అంకిత్ పై ఓ మొసలి దాడి చేసింది. అంకిత్ అరుపులు విపిస్తుండగా, వారి కళ్ల ముందే మొసలి బాలుడిని నీటిలోకి ఈడ్చుకెళ్లి ముక్కులు ముక్కలుగా కొరికి తినేసింది. ఎదురుగా అంత జరుగుతున్నా కన్నవారు సైతం కొడుకుని కాపాడుకోలేకపోయారు.

అంకిత్ మృతదేహం దాదాపు గంట సేపు వెతికి.. బయటకు తీశారు. అంకిత్ మృతి చెందడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నది ఒడ్డుకు చేరుకున్నారు. కోపోద్రిక్తులైన బంధువులు, గ్రామస్తులు నదిలో ఉన్న మొసలిని బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వలవేసి మొసలిని పట్టుకున్నారు. ఆగ్రహంతో కర్రలు, గునపాలతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు, మొసలి మృతదేహాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story