Pralay missiles: ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులకు గ్రీన్ సిగ్నల్..

Pralay missiles: ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులకు గ్రీన్ సిగ్నల్..
భారత సైన్యం అమ్ములపొదిలో మరో అరివీర భయంకర అస్త్రం

భారత సైన్యం అమ్ములపొదిలో మరో అరివీర భయంకర అస్త్రం చేరబోతోంది. ‘ప్రళయ్‌’ బాలిస్టిక్‌ క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ సముపార్జన మండలి(డీఏసీ) తాజా సమావేశంలో తుది నిర్ణయం వెలువడింది. వీటిని నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ సరిహద్దుల వద్ద భారత ఆర్మీకి మరింత బలం చేకూరనుంది.

ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వద్ద మోహరిస్తారు. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదిస్తాయి. 150-500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి.

భవిష్యత్తులో అవసరమైతే వీటి శ్రేణిని డీఆర్‌డీవో పెంచుతుంది. సంప్రదాయ యుద్ధ అస్త్రాలతో పాటు ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను ఆర్మీ వ్యూహాత్మకంగా మోహరిస్తుంది. భారత వాయుసేన విషయంలోనూ ఇటువంటి మరో ప్రతిపాదనకు కూడా రక్షణ శాఖ ఇటీవలే ఆమోదం తెలిపింది. సైన్యం వద్దనున్న ‘ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించే’ క్షిపణులన్నింటికంటే ప్రళయ్‌ క్షిపణులకు దీర్ఘ పరిధి ఉండటం విశేషం. భారత రాకెట్‌ బలగాల్లో మున్ముందు బ్రహ్మోస్‌, ప్రళయ్‌ రెండూ కీలకంగా మారనున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. డీఆర్‌డీఓ 2015లో ప్రళయ్‌ క్షిపణుల తయారీపై దృష్టిపెట్టింది. వీటి ప్రత్యేకతల్ని చూస్తే.. 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఇవి ఛేదించగలవు. 350 కిలోల నుంచి 700 కిలోల మధ్య బరువు కలిగిన వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలవు.

దేశ రక్షణ వ్యవస్థలో వ్యూహాత్మకంగా క్షిపణులను వాడడానికి పాలసీని రూపొందించడం భద్రత విషయంలో చాలా ప్రాధాన్య అంశమని నిపుణులు అంటున్నారు. చైనా, పాకిస్థాన్ దేశాల వ్యూహాత్మక ప్రణాళికలో ఇప్పటికే క్షిపణుల మోహరింపు అంశం ఉంది. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థను 2015 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 21, 22 తేదీల్లో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story