Delhi: బస్సులో పురుషుల వెకిలిచేష్టలు.. ఈ నగరాన్ని ద్వేషిస్తున్నానంటూ మహిళ పోస్ట్..

Delhi: బస్సులో పురుషుల వెకిలిచేష్టలు.. ఈ నగరాన్ని ద్వేషిస్తున్నానంటూ మహిళ పోస్ట్..
X
ఢిల్లీ లో రద్దీగా ఉండే పగటిపూట బస్సు ప్రయాణంలో ఇద్దరు పురుషుల నుండి పదేపదే వేధింపులు ఎదుర్కొన్న ఒక మహిళ తన బాధాకరమైన అనుభవాన్ని పంచుకుంది. ఈ సంఘటన నగరంలో ప్రజా రవాణాను ఉపయోగించే మహిళల భద్రతపై ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఢిల్లీలో ఒక మహిళ పట్టపగలు రద్దీగా ఉండే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పదేపదే వేధింపులను భరించిన తర్వాత తన నిరాశ మరియు బాధను బయటపెట్టింది.

ఆమె తన అనుభవాన్ని "అసహ్యకరమైనది" అని అభివర్ణించింది. 40 నిమిషాల ప్రయాణంలో ఇద్దరు వేర్వేరు పురుషులు తనను ఎలా వేధించారో వివరిస్తూ r/delhiలో ఒక వివరణాత్మక పోస్ట్‌ పెట్టింది. అది వైరల్ అయ్యింది.

రూట్ మార్పుల కారణంగా బస్సుల్లో రద్దీ ఎలా పెరిగిందో వివరిస్తూ ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించింది. "ఇది మధ్యాహ్నం వేడిగా ఉంది. బస్సు ప్రయాణీకులతో క్రిక్కిరిసిపోయింది. అనేక స్టాప్‌ల తర్వాత చివరికి సీటు దొరికింది. దీనికి ముందే యాభై ఏళ్ల వయసున్న ఒక పురుషుడు, వెనక్కి జరగమని తాను పదే పదే చెప్పినప్పటికీ వినిపించుకోకుండా తనకు దగ్గరగా వచ్చాడని ఆమె పేర్కొంది. ఆమె అతనిని వారించినా, అతను కదలడానికి నిరాకరించాడు. బస్సు దిగే వరకు తనను చూస్తూనే ఉన్నాడని తెలిపింది. అయితే ఈ వేధింపులు అక్కడితో ముగియలేదు.

మరొక వ్యక్తి అదే ప్రవర్తనను పునరావృతం చేశాడు. ఆమె వారింపులను తోసిపుచ్చుతూ, "బస్సు రద్దీగా ఉంది. నా తప్పు ఎలా అవుతుంది?" అని అన్నాడు.

ఒక మహిళా ప్రయాణీకురాలు జోక్యం చేసుకుని అతడిని అరిచింది. అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె పేర్కొంది. తన స్టాప్‌లో దిగిన తరువాతన తనకు దు:ఖం ఆగలేదని తెలిపింది. "నేను ఇంటికి వెళ్ళే దారి అంతా ఏడ్చాను" , అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ, తనను లక్ష్యంగా చేసుకుని ఆ వ్యక్తులు ప్రవర్తించిన అసభ్యకర విధానానికి సమాజంపట్ల, నగరం పట్ల ద్వేషం కలుగుతోందని పోస్ట్ లో పేర్కొంది.

"నేను చాలా అలసిపోయాను. చాలా అసహ్యంగా ఉంది. చాలా కోపంగా ఉంది," అని ఆమె తన కుటుంబ సభ్యులతో సంఘటనను పంచుకోలేకపోవడం పట్ల తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ రాసింది. మెట్రోలో వెళదామంటే స్టేషన్ చాలా దూరంలో ఉంది. అది చాలా కష్టం అని తెలిపింది.

ఆమె పోస్ట్ హృదయ విదారకమైన గమనికతో ముగించింది: "కేవలం 40 నిమిషాల్లో, ఇద్దరు వేర్వేరు పురుషులు నన్ను తాకగలిగారు, నాపైకి నెట్టగలిగారు. నా స్వంత శరీరం నాకు అసహ్యంగా అనిపించేలా చేయగలిగారు. నేను ఈ నగరాన్ని ద్వేషిస్తున్నాను. నేను ఈ వ్యవస్థను ద్వేషిస్తున్నాను. మహిళలు దానిలో జీవించడానికి తమను తాము కుంచించుకుపోతూ ఉండటాన్ని నేను ద్వేషిస్తున్నాను."

రాజధానిలో ప్రజా రవాణాను ఉపయోగించే మహిళలు ఎదుర్కొంటున్న నిరంతర భద్రతా సమస్యలపై వ్యాఖ్యల విభాగంలో అనేక మంది వినియోగదారులు సంఘీభావం ప్రకటించారు. మరికొందరు అసభ్యకరమైన పురుషులపట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఒక మహిళ ఇలా వ్యాఖ్యానించింది, "నేను బస్సులో వెళ్ళడం కంటే 30 నిమిషాలు నడవడానికి ఇష్టపడతాను, కానీ కొంతమంది పురుషుల వల్ల ఒక మహిళగా నడవడం కూడా కష్టం"గా ఉంది అని రాసింది. మరికొందరు "చాలా దురదృష్టకరం. ఒక మహిళగా ఈ వ్యవస్థ ఎప్పటికీ మారదని నాకు తెలుసు.

మరొక వ్యక్తి, "ఒక పురుషుడిగా, నాకు అర్థమైంది. నేను నా సోదరితో బయటకు వెళ్ళినప్పుడల్లా, పురుషులు ఆమెను ఎంత భయంకరంగా చూస్తారో నేను గమనించాను. అది నా రక్తాన్ని మరిగేలా చేస్తుంది" అని రాశాడు.





Tags

Next Story