ఆమె కల నెరవేరింది.. 30 ఏళ్ల మౌనవ్రతాన్ని వీడనుంది

ఆమె కల నెరవేరింది.. 30 ఏళ్ల మౌనవ్రతాన్ని వీడనుంది
రామమందిర నిర్మాణం ఆమె కల. ఆమె కల నెరవేర బోతోంది. ఆమె తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని వీడనుంది.

'మౌని మాత' అని కూడా పిలువబడే సరస్వతీ దేవి తన మూడు దశాబ్దాల 'మౌన వ్రతాన్ని' విడిచి పెట్టనుంది. జనవరి 22 న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంతో తన కల నిజమవనుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు, రాముని యొక్క అచంచలమైన భక్తురాలు. 1990ల ప్రారంభంలో వివాదాస్పద కట్టడం కూల్చివేత తర్వాత మహిళ మౌన ప్రతిజ్ఞ చేసింది.

ధన్‌బాద్‌లోని కర్మతాండ్ గ్రామంలో నివసించే సరస్వతీ దేవి 1990ల ప్రారంభం నుండి సంపూర్ణ మౌనాన్ని పాటిస్తూ, శ్రీరాముని పట్ల తనకున్న భక్తిని మరియు అయోధ్యలో రామమందిర నిర్మాణం పట్ల తన ప్రగాఢమైన కోరికను వ్యక్తం చేసింది. సరస్వతీ దేవి రామ మందిరం పూర్తయిన తర్వాత మరియు దాని ప్రాంగణంలో రాముని విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మాత్రమే మాట్లాడతానని ప్రతిజ్ఞ చేసింది . 2020 వరకు ఆమె 'మౌన వ్రతం' నుండి విరామం తీసుకొని ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట మాట్లాడినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆలయానికి పునాది వేసిన రోజున ఆమె పూర్తిగా మౌనంగా ఉంది.

ఆమె మౌన ప్రతిజ్ఞను విరమించుకోవాలని తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబంలో ఆనందాన్ని నింపింది. ఆమె స్వరం ఎప్పుడు వినబడుతుందా అని కుటుంబసభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా, రామాలయం ట్రస్ట్ 'మౌని మాత' (నిశ్శబ్ద తల్లి)గా ప్రసిద్ధి చెందిన సరస్వతీ దేవికి మరియు ఆమె కుటుంబ సభ్యులకు మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపింది.

దేవి తన మౌన ప్రతిజ్ఞ సమయంలో అయోధ్య, కాశీ, మధుర, తిరుపతి బాలాజీ, బాబా బైద్యనాథ్ ధామ్‌లను సందర్శించానని పేపర్ మీద రాసి తెలిపింది. శ్రీరాముని పట్ల భక్తితో సంవత్సరాలు గడిపినట్లు పంచుకుంది. అయోధ్య నుంచి వచ్చిన ఆహ్వానాన్ని దైవిక పిలుపుగా భావించి, సరస్వతీ దేవి తన మౌనాన్ని రాముని నామ జపంతో ఛేదించాలని నిశ్చయించుకుంది. ప్రధానమంత్రిని 'దశరథ్' (రాముడి తండ్రి) అని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని 'వసిష్ఠ' (రామాయణంలోని సాధువు) అని పేర్కొంటూ ఆమె నరేంద్ర మోడీ మరియు యోగి ఆదిత్యనాథ్‌లపై ప్రశంసలు కురిపించారు.

సరస్వతీ దేవి యొక్క జీవితకాల భక్తికి, త్యాగానికి ఇది గొప్ప గౌరవం.. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరు కావడానికి ఆహ్వానించబడినందుకు కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ శ్రీరామ చంద్రునికి భక్తితో ప్రణమిల్లుతోంది.

Tags

Read MoreRead Less
Next Story