DHARMASTHALA: హత్యలు లేవు.. హత్యాచారాలూ లేవు... "ధర్మ స్థలమే"

DHARMASTHALA: హత్యలు లేవు.. హత్యాచారాలూ లేవు... ధర్మ స్థలమే
X
కీలక మలుపు తిరిగిన ధర్మస్థల కేసు

కర్నా­ట­క­లో­ని దక్షిణ కన్నడ జి­ల్లా­లో ఉన్న ప్ర­సి­ద్ధ పు­ణ్య­క్షే­త్రం ధర్మ­స్థల. ఇక్కడ మం­జు­నాథ స్వా­మి కొ­లు­వై ఉన్నా­రు. అయి­తే గతం­లో ఇక్కడ అనేక అత్యా­చా­రా­లు, హత్య­లు జరి­గా­య­ని, తానే ప్ర­త్య­క్ష సా­క్షి­నం­టూ ఓ పా­రి­శు­ద్ధ్య కా­ర్మి­కు­డు ఫి­ర్యా­దు చే­య­డం సం­చ­ల­నం కలి­గిం­చిం­ది. ధర్మ­స్థల ఆలయం ఇటీ­వల సం­చ­ల­నా­త్మక ఆరో­ప­ణ­ల­కు కేం­ద్ర బిం­దు­వు­గా మా­రిం­ది. 1995 నుం­చి 2014 వరకూ మం­జు­నాథ ఆల­యం­లో పా­రి­శు­ద్ధ్య కా­ర్మి­కు­డి­గా పని చే­సిన భీమా అనే వ్య­క్తి జూన్ నె­ల­లో పో­లీ­సుల ముం­దు­కొ­చ్చి సం­చ­లన వి­ష­యా­లు వె­ల్ల­డిం­చా­డు. తాను పని చే­సిన కా­లం­లో వం­ద­ల­కొ­ద్దీ అమ్మా­యి­లు, మహి­ళల మృ­త­దే­హా­ల­ను నే­త్రా­వ­ది నది ఒడ్డున పాతి పె­ట్టా­న­ని, వా­ళ్లం­తా లైం­గిక వే­ధిం­పు­ల­కు గు­రైన వా­రే­న­ని వె­ల్ల­డిం­చా­డు. గతం­లో ధర్మ­స్థ­ల­లో పలు మి­స్సిం­గ్ కే­సు­లు కూడా నమో­దు కా­వ­డం­తో అతని ఆరో­ప­ణ­ల­కు బలం చే­కూ­రిం­ది. దీం­తో పో­లీ­సు­లు కేసు నమో­దు చే­శా­రు. కే­సు­ను సీ­రి­య­స్ గా తీ­సు­కు­న్న కర్నా­టక ప్ర­భు­త్వం ఐపీ­ఎ­స్ అధి­కా­రి ప్ర­ణ­బ్ మహం­తీ నే­తృ­త్వం­లో సిట్ ఏర్పా­టు చే­సిం­ది. కా­ర్మి­కు­డు చె­ప్పి­న­ట్లు దర్యా­ప్తు మొ­ద­లు పె­ట్టిం­ది. పా­రి­శు­ద్ధ్య కా­ర్మి­కు­డు సూ­చిం­చిన 13 ప్ర­దే­శా­ల్లో సిట్ తవ్వ­కా­లు చే­ప­ట్టిం­ది. కొ­న్ని­చో­ట్ల అస్థి­పం­జ­రా­లు, కొ­న్ని వస్తు­వు­లు లభిం­చా­యి. అయి­తే అవి సా­మూ­హిక ఖన­నా­ల­కు సం­బం­ధిం­చి­న­వి కా­వ­ని తే­లిం­ది. ఇతర జబ్బు­ల­తో చని­పో­యిన వా­ళ్ల అస్థి­క­లు­గా సిట్ గు­ర్తిం­చిం­ది. అయి­నా కా­ర్మి­కు­డు చె­ప్పిన ప్ర­తి ప్రాం­తం­లో­నూ సిట్ తవ్వ­కా­లు చే­ప­ట్టిం­ది. కానీ అతను చె­ప్పి­న­ట్లు సా­మూ­హిక ఖన­నాల ఆన­వా­ళ్లు లభిం­చ­లే­దు.

ధర్మస్థల విశిష్టతను దెబ్బ తీసే కుట్ర

ధర్మ­స్థల కే­సు­లో పె­ద్ద కు­ట్ర జరు­గు­తోం­ది. ధర్మ­స్థల ప్ర­తి­ష్ట­ను దె­బ్బ­తీ­సేం­దు­కు, శతా­బ్దాల నాటి సం­ప్ర­దా­యా­ల­ను దె­బ్బ­తీ­సేం­దు­కు ప్ర­ణా­ళి­కా­బ­ద్ధ­మైన వ్యూ­హా­న్ని కొం­ద­రు రూ­పొం­దిం­చా­రు. దీ­ని­పై ని­ష్పా­క్షిక దర్యా­ప్తు జరి­గిం­ది. దీ­ర్ఘ­కా­లం­గా ఉన్న సం­ప్ర­దా­యా­ని­కి అప­ఖ్యా­తి తీ­సు­కు­రా­వ­డా­ని­కి ఎవరో గట్టి­గా ప్ర­య­త్నిం­చా­రు. ము­సు­గు ధరిం­చిన వ్య­క్తి కో­ర్టు­కు వాం­గ్మూ­లం ఇచ్చా­డు. శి­వ­లిం­గె­గౌడ, బే­లూ­రు గో­పా­ల­కృ­ష్ణ, అశో­క్ రాయ్ సహా పలు­వు­రు నా­య­కు­లు సీ­ఎ­ల్పీ­లో దీని గు­రిం­చి మా­ట్లా­డా­రు. ఈ కేసు ని­రా­ధా­ర­మై­న­ద­ని, శూ­న్య­మై­న­ది. ఏవై­నా తప్పు­డు ఆరో­ప­ణ­లు లేదా కు­ట్ర­లు ఉంటే క్షు­ణ్ణం­గా దర్యా­ప్తు చే­యా­ల­ని, బా­ధ్యు­ల­పై చట్ట­ప­ర­మైన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని ప్ర­భు­త్వం కూడా ఆదే­శిం­చిం­ది. ధర్మ­స్థ­ల­లో రా­జ­కీయ జో­క్యం­పై బీ­జే­పీ చే­స్తు­న్న ఆరో­ప­ణ­ల­ను తో­సి­పు­చ్చా­రు.

హైందవ ధర్మంపై దాడి

ఇది హైం­దవ ధర్మం­పై దా­డి­గా అభి­వ­ర్ణిం­చా­రు. హిం­దూ­మ­తం­పై విషం చి­మ్మ­డం­లో భా­గం­గా­నే కొం­త­మం­ది ఇలాం­టి ఆరో­ప­ణ­లు చే­స్తు­న్నా­ర­ని, అలాం­టి వా­ళ్ల­పై కఠిన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. వీ­ట­న్ని­టి­కీ చెక్ పె­ట్టేం­దు­కు కర్నా­టక ప్ర­భు­త్వం సిట్ ఏర్పా­టు చే­సిం­ది. అయి­తే ఏకం­గా ఫి­ర్యా­దు దా­రు­డే ఇప్పు­డు ప్లే­ట్ ఫి­రా­యిం­చ­డం­తో కేసు మళ్లీ మొ­ద­టి­కొ­చ్చిం­ది. ధర్మస్థల సామూహిక ఖననాల కేసు ఒక సంచలన ఆరోపణతో మొదలైంది. ఇప్పుడు రహస్య కుట్రలతో మరో మలుపు తీసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడు యూటర్న్ తీసుకోవడం, తవ్వకాలలో ఆధారాలు లభించకపోవడం.. లాంటివి ఈ కేసును మరింత జటిలంగా మార్చేశాయి. ఇప్పుడు మరోసారి ముసుగు మనిషి మాట మార్చడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం రేగుతోంది. ఇది కేవలం హైంధవ ధర్మంపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.

Tags

Next Story