IRCTC: తిని పారేసిన డిస్పోజబుల్‌ కంటైనర్లను కడిగి..!మళ్లీ ప్యాకింగ్..

IRCTC: తిని పారేసిన డిస్పోజబుల్‌ కంటైనర్లను కడిగి..!మళ్లీ ప్యాకింగ్..
X
అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో షాకింగ్‌ ఘటన

తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను మళ్లీ క్లీన్ చేసి వాటిలోనే ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు క్యాటెరింగ్ సిబ్బంది. ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అందులో, ఒక వ్యక్తి ప్యాక్ చేసిన ఆహారం కోసం ఉపయోగించే డిస్పోజబుల్ పాత్రలను కడుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చర్యలు తీసుకుంది.

ఈ సంఘటన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. వీడియోలో, ఒక వ్యక్తి వాడిపారేసిన ఫుడ్ కంటెయినర్లను వాష్‌బేసిన్‌లో కడుగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రయాణీకులు వాటిని తిన్న తర్వాత పారవేస్తారు. ఆ తర్వాత అతను కంటైనర్లను తిరిగి వాడటానికి సిద్ధం చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ సంఘటన బోర్డ్ నంబర్ 16601, ఈరోడ్-జోగ్బాని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, IRCTC వెంటనే చర్యలు తీసుకుంది. IRCTC సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక ప్రకటన విడుదల చేసింది, ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. వారు విక్రేతను గుర్తించి వెంటనే అతన్ని తొలగించారు. లైసెన్స్ దారుడి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు IRCTC కూడా పేర్కొంది. అదనంగా, భారీగా జరిమానా విధించినట్లు తెలిపింది.

Tags

Next Story