Air india: ఎయిరిండియా విమాన ప్రమాద మృతులను గుర్తించేందుకు కొనసాగుతున్న డీఎన్‌ఏ పరీక్షలు

Air india: ఎయిరిండియా విమాన ప్రమాద మృతులను గుర్తించేందుకు కొనసాగుతున్న డీఎన్‌ఏ పరీక్షలు
X
47 మంది వివరాలను గుర్తింపు , 24 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో డీఎన్‌ఎ పరీక్ష ద్వారా గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీతో సహా 47 మంది మృతుల వివరాలను గుర్తించినట్టు వైద్యాధికారులు ఆదివారం తెలిపారు. ఇందులో రూపానీ సహా 24 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్టు చెప్పా రు. ఇప్పటివరకు గుర్తించిన మృతుల్లో గుజరాత్‌, రాజస్థాన్‌కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని అదనపు సివిల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేశ్‌ పటేల్‌ విలేకరులకు వెల్లడించారు. రూపానీ అంత్యక్రియలను రాజ్‌కోట్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్‌ తెలిపారు.

కూలిన విమానానికి మా కంపెనీ మెయింటెనెన్స్‌ చేయలేదు: తుర్కియే

కూలిన బోయింగ్‌ 787-8 ప్రయాణికుల విమానాలకు టర్కిష్‌ టెక్నిక్‌ కంపెనీ మెయింటెనెన్స్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తప్పు అని తుర్కియే ప్రభుత్వం ప్రకటించింది. తుర్కియే-భారత్‌ మధ్య సంబంధాలపై ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే లక్ష్యంతోనే ఇదంతా జరుగుతున్నదని తెలిపింది. తమ ఒప్పందం పరిధిలోకి బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ రాదని పేర్కొంది.

ఒకరిది అదృష్టం.. మరొకరిది దురదృష్టం

ఎయిరిండియా విమాన ప్రమాదం ఒకే కుటుంబానికి ఓ వైపు సంతోషాన్ని పంచి, మరోవైపు విషాదాన్ని మిగిల్చింది. 11ఏ సీట్లో కూర్చున్న విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ అదే విమానంలో ఉన్న ఆయన సోదరుడు అజయ్‌ తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. వేరొక వరుసలో కూర్చున్న అజయ్‌, మరణించిన 241 మందిలో ఒకరు.

Tags

Next Story