Swami Swaroopananda Saraswathi : శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం..

X
By - Sai Gnan |11 Sept 2022 9:20 PM IST
Swami Swaroopananda Saraswathi : గుజరాత్లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యమయ్యారు
Swamy swaroopananda Saraswathi : గుజరాత్లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యమయ్యారు. 99 ఏళ్ల ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యప్రదేశ్లోని శ్రీధాం జోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
1924లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిఘోరీలో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంటిని వదిలి మతప్రచారాన్ని మొదలుపెట్టారు. స్వామీజీ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగీ ఆదిత్యనాధ్, సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి స్వరూపానంద సరస్వతీ అంత్యక్రియాలు సోమవారం నిర్వహించనున్నట్లు ఆశ్రమ వర్గాలు తెలిపాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com