Earthquake: దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం, టిబెట్‌లో 7.1గా నమోదు

Earthquake: దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం, టిబెట్‌లో 7.1గా నమోదు
X
యూపీ, బీహార్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి

హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికించాయి. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆతర్వాత స్వల్ప తీవ్రతతో మరో రెండుసార్లు ప్రకంపణలు వచ్చాయి. కొన్ని క్షణాలపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఖఠ్మండూతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులుపెట్టారు.

మంగళవారం ఉదయం 6.35 గంటలకు నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో భూమి కపించింది. టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. అనంతరం షిజాంగ్‌ ప్రాంతంలోనే మరో రెండుసార్లు భూమి కంపించిందని, వాటి తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.7, 4.9గా నమోదయిందని వెల్లడించింది.

భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్‌, బెంగాల్‌, బీహార్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.

కాగా, టిబెట్‌లోని షిగెట్స్‌ పట్టణంలో గత ఐదేండ్లలో 29 సార్లు భూకంపం వచ్చింది. ఇవన్నీ 3 లేదా అంతకంటే ఎక్కవ తీవ్రతతో కూడుకున్నవని, 200 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే మంగళవారం ఉదయం సంభవించిన భూకంపంతో పోల్చితే ఇవన్నీ చాలా చిన్నవని తెలిపారు.

Tags

Next Story