Earthquake | ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం..

Earthquake | ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం..

ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. భూ ప్రకంపనలు భారీగా రావడంతో ప్రజలంతా హడలిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని భూకంపం సంభవించింది. . దాదాపు ఒక నిమిషం పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసుల్లో ఉన్న వారు అంతా కూడా భయంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఢిల్లీతో పాటు..ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 10 సెకన్ల పైగా ప్రకంపనలు వచ్చాయని అధికారులు నిర్థారించారు. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు నిరంతరంగా భూకంపం సంభవించింది. నేపాల్లో ఇవాళ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి నేపాల్ వణికింది. దీని ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది. దీంతో ఢిల్లీలోనూ భారీ ప్రకంపనలు వచ్చాయి. కాసేపు ఢిల్లీ వాసులు కంగారు పడ్డారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు తెలుసుకుని ఆ తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.


Next Story