Sonia Gandhi ED : మూడు రోజుల్లో సోనియాను ఈడీ అన్ని ప్రశ్నలడిగారా..?

Sonia Gandhi ED : మూడు రోజుల్లో సోనియాను ఈడీ అన్ని ప్రశ్నలడిగారా..?
Sonia Gandhi ED : నేషనల్ హెరాల్డ్‌ కేసులో మూడో రోజు సోనియా గాంధీ విచారణ ముగిసింది.

Sonia Gandhi ED : నేషనల్ హెరాల్డ్‌ కేసులో మూడో రోజు సోనియా గాంధీ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ ఆఫీసుకు వచ్చారు సోనియా. ఇవాళ దాదాపు మూడు గంటల పాటు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. ఐతే మళ్లీ విచారణకు హాజరుకావాలని ఈడీ ఎలాంటి సమన్లు జారీ చేయలేదు. మొదటి రోజు 2 గంటలు, రెండో రోజు 6 గంటల పాటు సోనియాను విచారించింది ఈడీ. మొత్తంగా మూడు రోజుల్లో 11 గంటలకు పైగా సోనియాను విచారించిన అధికారులు....వందకు పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

తమ ప్రశ్నలకు సోనియా గాంధీ వెంట వెంటనే సమాధానాలు చెప్పిందని ఈడీ అధికారులు వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ దినపత్రిక వ్యవహారాల్లో సోనియా పాత్రపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.ఈ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని సైతం ఈడీ విచారించింది.

ఈడీ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయ్ చౌక్‌ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా నిరసన నిర్వహించేవిధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈడీ దుర్వినియోగం ఆపాలని నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story