Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్లో మరో ఎన్కౌంటర్..

ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. రాత్రి మళ్ళీ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. గత నాలుగు రోజుల నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు సుధాకర్ తో పాటు భాస్కర్ మృతి చెందారు. భద్రతా బలగాలు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
గత మూడు రోజులుగా నేషనల్ పార్క్లో నక్సలైట్లపై ఆపరేషన్ కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో జరిగిన ఈ ఆపరేషన్లో, కోటి రివార్డుతో నక్సలైట్ సుధాకర్, 25 లక్షల రివార్డుతో భాస్కర్ కూడా మరణించారు. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ఇద్దరు టాప్ కమాండర్లతో సహా నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.. గురు, శుక్రవారాల్లో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్, భాస్కర్ మరణించారు. భాస్కర్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించగా, సుధాకర్ఫై రూ.40 లక్ష రివార్డు ఉన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com