By - Subba Reddy |22 April 2023 3:15 AM GMT
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సీబీఐ సమన్లు పంపింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనుంది. జమ్మూకశ్మీర్ గవర్నర్గా మాలిక్ ఉన్న సమయంలో రిలయన్స్ ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన అంశంపై ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందన్నారు సత్యపాల్ మాలిక్. దీంతో సత్యపాల్ మాలిక్కు పరువునష్టం నోటీసు పంపారు రామ్ మాధవ్. జమ్మూకశ్మీర్ గవర్నర్గానే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లోనూ గవర్నర్గా మాలిక్ పనిచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com