Rameshwaram Cafe Blast : రామేశ్వరం పేలుడు కేసులో కీలక నిందితుడి అరెస్ట్

Rameshwaram Cafe Blast : రామేశ్వరం  పేలుడు కేసులో కీలక నిందితుడి అరెస్ట్
ఎన్ఐఏ అదుపులో కీలక నిందితుడు ముజమ్మిల్ షరీఫ్‌

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బుధవారం ముందడుగు వేసింది. ఈ కేసులో కీలక నిందితుడిని బుధవారం అరెస్టు చేసింది. కర్ణాకట, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత ఎన్ఐఏ కీలక నిందితుడు ముజమ్మిల్ షరీఫ్‌ను పట్టుకుంది.

కర్ణాటకలో 12 చోట్ల, తమిళనాడులో ఐదు చోట్ల, ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట ఈ రైడ్లు చేపట్టింది. ఎట్టకేలకు ఈ కేసులో కీలక నిందితుడైన షరీఫ్ అరెస్టుతో ఆ సోదాలు ముగిశాయి. పలు చోట్ల చేపట్టిన తనిఖీల్లో అధికారులు నిందితుల డబ్బు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరం బ్లాస్ట్ కేసులోని మాస్టర్ మైండ్లను, ఈ పేలుడు వెనుక జరిగిన భారీ కుట్రను కనుగొనడానికి ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా షజీబ్ హుస్సేన్‌ను గతంలో దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరో నిందితుడు అబ్దుల్ మతీన్ తాహాతో కలిసి ఈ పేలుడు జరిపారని అనుమానించారు. ఎన్ఐఏ ప్రకారం, షరీఫ్ ఆ దుండగులకు పేలుడు కోసం లాజిస్టికల్ మద్దతు ఇచ్చాడు.

ఈ నెల మూడో తేదీన ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కర్ణాటకలోని 12 చోట్ల, తమిళనాడులో ఐదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకచోట దాడులు చేశాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులకు సహాయం చేసిన మజుమ్మిల్ షరీఫ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ముస్సావిర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మథీన్ తహా గాగుర్తించారు. బాంబు దాడికి నెల రోజుల ముందు నుంచి ముస్సావిర్, అబ్దుల్‌లు చెన్నైలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

Tags

Read MoreRead Less
Next Story