FARMERS: వ్యవసాయాభివృద్ధికి రూ.24వేల కోట్లు

FARMERS: వ్యవసాయాభివృద్ధికి రూ.24వేల కోట్లు
X
100 జిల్లాల్లో కొత్త పథకం

కేం­ద్ర క్యా­బి­నె­ట్‌ ‘పీఎం ధన్‌ ధా­న్య కృషి యోజన’కు ఆమో­దం తె­లి­పిం­ది. వ్య­వ­సాయ రం­గా­న్ని స్థి­రం­గా అభి­వృ­ద్ధి చే­య­డం, రై­తుల ఆదా­యా­న్ని పెం­చ­డం లక్ష్యం­గా రూ­పొం­దిం­చిన ఈ పథ­కా­న్ని దే­శ­వ్యా­ప్తం­గా 100 జి­ల్లా­ల్లో అమలు చే­య­ను­న్నా­రు. 2025–26 నుం­చి ప్రా­రం­భ­మ­య్యే ఈ ప్రో­గ్రా­మ్‌­ను ఆరే­ళ్ల పాటు కొ­న­సా­గిం­చ­ను­న్నా­రు. ప్ర­తి సం­వ­త్స­రం రూ.24వేల కో­ట్ల వ్య­యం అం­చ­నా వే­య­బ­డిం­ది. ఈ యోజన ద్వా­రా పం­ట­ల్లో వై­వి­ధ్యీ­క­రణ, స్థి­ర­మైన సా­గు­ప­ద్ధ­తు­లు, నీ­టి­పా­రు­దల సదు­పా­యా­లు, గ్రా­మీణ గో­దా­ము­లు, రుణ సౌ­ల­భ్యం వంటి అం­శా­ల­పై దృ­ష్టి సా­రిం­చ­ను­న్నా­రు. మొ­త్తం 11 శాఖల 36 పథ­కా­ల­ను సమ­న్వ­యం చేసి, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు, ప్రై­వే­టు భా­గ­స్వా­ము­ల­తో కలి­సి అమలు చే­స్తా­రు. ఉత్పా­ద­కత తక్కు­వ­గా ఉండే జి­ల్లా­లు, పంటల వి­భి­న్నత లే­క­పో­వ­డం, రుణ ప్రా­ప్యత తక్కు­వ­గా ఉం­డ­టా­న్ని దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని 100 జి­ల్లా­ల­ను ఎం­పిక చే­స్తా­రు. ఈ పథ­కా­న్ని వి­జ­య­వం­తం­గా అమలు చే­యేం­దు­కు జి­ల్లా, రా­ష్ట్ర, జా­తీయ స్థా­యి­లో ప్ర­త్యేక కమి­టీ­ల­ను ఏర్పా­టు చేసి, మొ­త్తం 117 పని­తీ­రు సూ­చి­కల ఆధా­రం­గా పర్య­వే­క్షిం­చ­ను­న్నా­రు. దీని ద్వా­రా ఏటా 1.7 కో­ట్ల మంది రై­తు­ల­కు లాభం చే­కూ­ర­నుం­ది.

ఈ పథకం ద్వా­రా రై­తు­ల­కు శా­స్త్రీయ సా­గు­ప­ద్ధ­తు­లు, మా­ర్కె­ట్‌­కు కనె­క్టి­వి­టీ, పంటల బీమా, వి­త్త­నా­లు, సేం­ద్రియ ఎరు­వుల ప్రో­త్సా­హం వంటి అం­శా­ల్లో ప్ర­త్యేక దృ­ష్టి ఉం­టుం­ది. మౌ­లిక వస­తుల మె­రు­గు­ద­ల­తో పాటు, డి­జి­ట­ల్ వ్య­వ­సాయ వి­ధా­నా­ల­ను కూడా ప్రో­త్స­హిం­చ­ను­న్నా­రు. వ్య­వ­సా­యా­న్ని లా­భ­దా­య­కం­గా మా­ర్చేం­దు­కు సాం­కే­తిక పరి­జ్ఞా­నం వి­ని­యో­గం పెం­పొం­దిం­చ­ను­న్నా­రు. రై­తు­ల­కు శి­క్షణ కా­ర్య­క్ర­మా­లు, నూతన పద్ధ­తు­ల­పై అవ­గా­హన కల్పిం­చేం­దు­కు ప్ర­త్యేక కేం­ద్రా­ల­ను కూడా ఏర్పా­టు చే­స్తా­రు. ప్రాం­తీయ అవ­స­రా­ల­ను బట్టి స్థా­నిక సం­స్థ­ల­తో కలి­సి కా­ర్యా­చ­రణ రూ­పొం­దిం­చ­ను­న్నా­రు. పంట ది­గు­బ­డుల ని­ల్వ, ప్రా­సె­సిం­గ్ యూ­ని­ట్లు, మా­ర్కె­టిం­గ్ సౌ­క­ర్యాల కల్పన కూడా ఈ పథ­కం­లో భా­గం­గా ఉం­టుం­ది. వ్య­వ­సా­యం­తో పాటు, డె­యి­రీ, ఫి­ష­రీ­స్, హా­ర్టి­క­ల్చ­ర్ రం­గా­ల్లో సమ­న్వ­యం­తో అభి­వృ­ద్ధి చే­స్తా­రు. రైతు ఆదా­యం రెం­డిం­త­లు చే­యా­ల­న్న లక్ష్యం­తో కేం­ద్రం ఈ పథ­కా­న్ని అమలు చే­య­నుం­ది. సమ­గ్ర వ్య­వ­సాయ ప్ర­ణా­ళిక రూ­పం­లో ఇది పి­ల­వ­బ­డు­తుం­ది. దీని అమ­లు­తో గ్రా­మీణ ఆర్థిక వ్య­వ­స్థ­పై గణ­నీ­య­మైన ప్ర­భా­వం ఉండే అవ­కా­శం ఉంది.

అమలు ఇలా..

వ్య­వ­సాయ రం­గం­లో ఉత్పా­ద­క­త­ను పెం­చ­డం, పం­ట­ల్లో వై­వి­ధ్యీ­క­రణ, స్థి­ర­మైన వ్య­వ­సాయ పద్ధ­తు­ల­ను ప్రో­త్స­హిం­చ­డం, పం­ట­కోత తర్వాత గ్రా­మ­స్థా­యి­ల్లో ది­గు­బ­డు­ల­ను ని­ల్వ చే­సేం­దు­కు గో­దా­ముల సదు­పా­యం, నీ­టి­పా­రు­దల సౌ­క­ర్యా­ల­ను మె­రు­గు­ప­ర­చ­డం, రుణ లభ్య­త­ను సు­ల­భ­త­రం చే­య­డ­మే లక్ష్యం­గా పీఎం ధన్‌ ధా­న్య కృషి యో­జ­న­ను రూ­పొం­దిం­చా­రు. ఈ కా­ర్య­క్ర­మం కోసం ఏటా రూ.24వేల కో­ట్లు వ్య­యం చే­య­ను­న్నా­రు. మొ­త్తం 11 శా­ఖ­ల్లో 36 పథ­కా­లు, రా­ష్ట్రం­లో­ని ఇతర పథ­కా­లు, ప్రై­వే­టు రం­గం­తో స్థా­నిక భా­గ­స్వా­మ్యం ద్వా­రా దీ­న్ని అమలు చే­య­ను­న్నా­రు. ఉత్పా­ద­కత తక్కు­వ­గా ఉం­డ­టం, అన్ని రు­తు­వు­ల్లో­నూ పంట సా­గు­బ­డి చే­య­క­పో­వ­డం, రుణ లభ్యత అత్యంత తక్కు­వ­గా ఉం­డ­టం అనే మూడు కీలక సూ­చి­కల ఆధా­రం­గా 100 జి­ల్లా­ల­ను గు­ర్తి­స్తా­రు. ఈ పథకం సమ­ర్థ­వం­తం­గా అమలు జరి­గే­లా పర్య­వే­క్షిం­చేం­దు­కు జి­ల్లా, రా­ష్ట్ర, జా­తీయ స్థా­యి­లో కమి­టీ­ల­ను ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. ప్ర­తి ధన్-ధా­న్య జి­ల్లా­లో ఈ పథకం పు­రో­గ­తి­ని 117 పె­ర్ఫా­మె­న్స్‌ ఇం­డి­కే­ట­ర్ల ద్వా­రా పర్య­వే­క్షి­స్తా­రు.

Tags

Next Story