Constable Suicide :ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో గురువారం మహిళా కానిస్టేబుల్ మీను ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఎందుకంటే ఆమే పోస్టుమార్టం రిపోర్టులో ఆమె శరీరంపై 500కుపైగా గాయాలు ఉన్నట్టు వెల్లడైంది. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మీను శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
అయితే స్థానికులను విచారించగా మరో కొత్త విషయం బయటపడింది. అలీగఢ్కు చెందిన ఓ కానిస్టేబుల్తో ఆమె ప్రేమలో ఉన్నట్టు వారు చెప్పారు. మీనును ప్రేమించిన అతడు ఆమెను మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకున్నట్టు తెలిపారు. విషయం తెలిసిన ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలు ఎన్ని సార్లు ఫోన్ చేసినా అతను పట్టించుకోవటంలేదు అని తెలుస్తోంది. ఈ కారణం తోనే ఆమే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.
అయితే, ఆమె శరీరంపై అన్ని గాయాలు ఎలా అయ్యాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. బహుశా ఆమె తనంత తానే గాయాలు చేసుకుని ఉంటుందని భావిస్తున్నా.. శరీరం నిండా గాయాలు చేసుకోవడం సాధ్యం కాదని కూడా చెబుతున్నారు. దీంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com