జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్

జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్ముకశ్మీర్లోని ఇండో-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లా సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఉగ్రవాదుల గురించి కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో, ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు.
దీంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్ గా మారింది. నియంత్రణ రేఖ సమీపంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది సైన్యం. కృష్ణా ఘాటి సెక్టార్లో సెర్చ్ ఆపరేషన్లో ఈ రికవరీ జరిగిందని.. ఇందులో పాకిస్తాన్లో తయారైన స్టీల్ కోర్ కాట్రిడ్జ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.నిఘా వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో రెండు బ్యాగుల్లో ఒక ఏకే-47 రైఫిల్, తొమ్మిది మ్యాగజైన్లు, రెండు 438 కాట్రిడ్జ్లు లభించాయని వెల్లడించారు.
వీటితో పాటుగా ఒక పిస్తోల్, కొన్ని మందులు ఉన్నాయన్నారు.జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు చొరబాట్లు జరగకుండా భద్రతా బలగాలు వరుస సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. లోయలో కొనసాగుతున్న సోదాల్లో భాగంగానే నేటి కౌంటర్-ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్ జరిగింది. గతంలో ఫిబ్రవరి 10 నుంచి ఇప్పటి వరకు , కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటుకు చాలా ప్రయత్నాలు జరిగాయి, అయితే ఈ ప్రయత్నాలను భద్రతా దళాలు విఫలం చేస్తూనే ఉన్నాయని అధికారులు గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com