AM Khanwilkar: లోక్పాల్ ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి

లోక్పాల్ చైర్పర్సన్తో పాటు సభ్యులుగా నియమితులైన ఆరుగురి పేర్లను రాష్ట్రపతి భవనం విడుదల చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖాన్విల్కర్ను లోక్పాల్ చైర్పర్సన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నియమించారు. లోక్పాల్ చీఫ్, సభ్యుల ఎంపికపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది.
జస్టిస్ ఖాన్విల్కర్ 2022 జూలైలో సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేశారు. మాజీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్ , జస్టిస్ రితు రాజ్ అశ్వతీలను లోక్పాల్ న్యాయ సభ్యులుగా రాష్ట్రపతి నియమించారు. అవినీతి నిరోధక అంబుడ్స్మన్లో సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్ , అజయ్ టిర్కీ నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర స్థాయిలో లోక్పాల్ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. పబ్లిక్ సర్వెంట్లలో కొన్ని విభాగాల వారిపై వచ్చే అవినీతి కేసులపై దృష్టిపెట్టడం వీటి విధి. లోక్పాల్ కమిటీలో ఒక ఛైర్పర్సన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులు ఉండాలి. వీరిలో నలుగురు జ్యుడిషియల్ సభ్యులై ఉండాలి.లోక్పాల్ ఛైర్పర్సన్, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గల ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారు. లోక్పాల్ చీఫ్గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం 2022 మే 27న ముగిసిన తర్వాత.. రెండేండ్లుగా చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉండిపోయింది. ఇంతకాలం తాత్కాలిక చైర్పర్సన్గా లోక్పాల్ సభ్యులు జస్టిస్ ప్రదీప్ కుమార్ మెహంతీ కొనసాగారు.
ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై విచారణకు సంబంధించి లోకాయుక్త చట్టం 2013 తెచ్చారు. ఈ లోక్ పాల్లో ఓ చైర్పర్సన్, 8 మంది సభ్యులు ఉంటారు, వీరిలో 50% మంది న్యాయవ్యవస్థకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. సభ్యులు ఐదు సంవత్సరాలు, వారికి 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవీకాలం కలిగి ఉంటారని తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com