టీ చేస్తుండగా సిలిండర్ పేలి 11 నెలల బాలికతో సహా నలుగురు మృతి
By - Prasanna |30 March 2024 6:31 AM GMT
డియోరియాలోని ఒక కుటుంబానికి మార్నింగ్ టీ దుఃఖ పర్యంతంగా మారింది.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ మహిళ ఇంట్లో టీ తయారు చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో టీ తయారు చేస్తున్న మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు. విషయం భలువాని ప్రాంతంలోని డుమ్రి గ్రామం.
సమాచారం మేరకు శివశంకర్ గుప్తా భార్య ఆర్తీదేవి(35) ఉదయం టీ తయారు చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఇందులో ఆర్తితో పాటు ఆమె పిల్లలు ఆంచల్ (14), కుందన్ (12), 11 నెలల సృష్టి కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ నివేదికను ఆయన ప్రభుత్వానికి పంపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com