Vaccine Booster Dose : జులై 15 నుంచి ఉచితంగా బూస్టర్ డోస్

Vaccine Booster Dose : కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం జులై 15 నుంచి ఉచితంగా అందించనుంది. దేశంలో మెజారిటీ ప్రజలు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆరు నెలల తరువాత వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీలు తగ్గిపతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మూడవ డోసు తీసుకోవడం అత్యవసరం అని పిరిశోధకులు చెబుతున్నారు.
జులై 15 నుంచి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. 75 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 96 శాతం మంది మొదటి డోసు తీసుకుంటే.. 87 శాతం మంది రెండవ డోసు తీసుకున్నారు.
ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. రోజుకు 18వేలకు అటు ఇటు కరోనా కేసులు నమోదవుతున్నాయి. రికవరీ రేటు 98 శాతానికంటే ఎక్కువే ఉంది. ముందు జాగ్రత్త చర్యగా బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకొంటే రోగనిరోధక శక్తి పెరుగుతందని వైద్య నిపుణులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com