YOUTUBE: పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్పై.. మోదీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం.. పాక్ పౌరుల వీసాల రద్దు సహా కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్పై నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్స్పై వేటు పడింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సహా పలు పాకిస్థానీయుల ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లకు సందేశం పంపించింది. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పాకిస్థానీ మీడియా సంస్థను కూడా భారత్ లో నిషేధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్కు చెందిన ‘100mph’ ఛానెల్పై కూడా నిషేధం పడింది. భారతదేశం, భారత సైన్యం, భద్రతా సంస్థలపై తప్పుడు సమాచారం, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ను ప్రచారం చేస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాక్కు చెందిన 16 యూబ్యూట్ ఛానళ్లపై నిషేధం విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com