G20 dinner : రేపు రాష్ట్రపతి అత్యున్నత స్థాయి విందు

G20 dinner : రేపు రాష్ట్రపతి అత్యున్నత స్థాయి విందు
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం

ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమయింది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. వీరితోపాటు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విందుకు ఆహ్వానించారు.

జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమయింది. వివిధ దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా హస్తినకు చేరుకుంటున్నారు. రేపు, ఎల్లుండి జరగనున్న ఈ సమావేశాలకు 40కి పైగా దేశాధినేతలు హాజరవుతున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ సమావేశాలు ఢిల్లీలోని 'భారత్ మండపం' వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపధ్యం లోనే రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత స్థాయి విందును ఇవ్వబోతున్నారు. సదస్సు సందర్భంగా జరగబోయే విందులకు 500 మంది ప్రముఖులను కేంద్రం ఆహ్వానం పంపింది.


ఈ విందుకు మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ లకు ఆహ్వానం అందింది. వీరితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను విందుకు ఆహ్వానించారు. వీరిలో విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కేసీఆర్, నితీశ్ కుమార్, భగవంత్ మాన్, సిద్ధరామయ్య తదితరులు ఉన్నారు. కేబినెట్, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులందరినీ విందుకు ఆహ్వానించారు. భారత ప్రభుత్వ కార్యదర్శులందరూ,పెద్ద పారిశ్రామికవేత్తలతో సహా ఇతర ప్రముఖ అతిథులు కూడా అతిథి జాబితాలో ఉన్నారు. బీహార్‌కు చెందిన నితీష్ కుమార్, జార్ఖండ్ నుంచి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, తమిళనాడు నుంచి ఎంకే స్టాలిన్, ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ నుంచి భగవంత్ మాన్ విందుకు హాజరవుతారని ధృవీకరించిన ముఖ్యమంత్రుల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఆహ్వానం అందింది. ఈ విందుకు ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా భారత్ ప్రెసిడెంట్ అని ఆహ్వానంలో ముద్రించైనా విషయం తెలిసిందే.

ఈ విందుకు ప్రపంచ నేతలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రైమ్ మినిస్టర్ రుషి సునాక్, సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ పీఎం కిషిండా తదితరులు కూడా హాజరుకానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story