Go First : ప్రయాణికులను మరచింది... మూల్యం చెల్లించుకుంది

Go First : ప్రయాణికులను మరచింది... మూల్యం చెల్లించుకుంది
ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన గో ఫస్ట్ ఎయిర్ వేస్; రూ.10లక్షల జరిమానాను విధించింది DGCA...


ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయినందుకుగానూ గో ఫస్ట్ ఎయిర్ వేస్ కు రూ.10లక్షల జరిమానాను విధించింది DGCA (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). జనవరి 9న బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా గోఫస్ట్ విమానం వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై నివేదిక అందించాలని డీజీసీఏ, సదరు ఎయిర్ లైన్స్ ను ఆదేశించింది.

జరిగిన తప్పుకు క్షమాపణ తెలిపింది గోఫస్ట్ ఎయిర్ లైన్స్. పర్యవేక్షణ లోపంగానే తప్పు జరిగిందని తెలిపింది. ప్రయాణికులను నాలుగు గంటల తర్వాత ఉచితంగానే.. వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు చెప్పింది. దీంతో పాటు రాబోయే 12నెలల్లో ఏదైనా దేశీయ సెక్టార్ లో ప్రయాణించడానికి బాధిత ప్రయాణికులందరికి ఉచితంగా టికెట్టును అందించనున్నట్లు ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story