Harnaaz Sandhu: అందరి ముందు ఒక్కసారిగా ఎమోషనల్ అయిన మిస్ యూనివర్స్.. కారణం ఏంటంటే..

Harnaaz Sandhu (tv5news.in)

Harnaaz Sandhu (tv5news.in)

Harnaaz Sandhu: ‘వెల్‌కమ్ హోమ్ షేర్ని’ అంటూ ఓ పోస్టర్‌ను హర్నాజ్‌కు అందజేసి తన ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు.

Harnaaz Sandhu: మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కిరీటాన్ని అతిపెద్ద గౌరవంగా భావిస్తారు మోడల్స్. అయితే మిస్ యూనివర్స్ కిరీటాన్ని 21 ఏళ్ల తర్వాత ఇండియాకు తీసుకొచ్చింది హర్నాజ్ సంధు. 21 ఏళ్ల క్రితం లారా దత్తా ఇండియా తరపున మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఎంతోమంది భామలు మిస్ యూనివర్స్ స్టేజ్ వరకు వెళ్లి వెనుదిరిగారు. అయితే మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న హర్నాజ్ సంధు ఒక్కసారిగా ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత హర్నాజ్ ఎన్నో ఈవెంట్లకు వెళ్లింది. ప్రతీ ఈవెంట్‌కు తాను ఎంపిక చేసుకునే దుస్తులు, ఫ్యాషన్ స్టైల్‌తోనే ఎప్పుడూ వార్తల్లో నిలిచింది. మిస్ యూనివర్స్‌ గౌరవాన్ని దక్కించుకున్న తర్వాత హర్నాజ్ మొదటిసారి ఇండియాకు వచ్చింది. దీంతో చాలామంది ఆమెకు ఘన స్వాగతం చెప్పడానికి వెళ్లారు.

'వెల్‌కమ్ హోమ్ షేర్ని' అంటూ ఓ పోస్టర్‌ను హర్నాజ్‌కు అందజేసి తన ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అయితే అప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో అక్షయ్ కుమార్ 'తేరీ మిట్టి' పాట ప్లే అవ్వడంతో ఆ పాట విని హర్నాజ్ చాలా ఎమోషనల్ అయ్యింది. దేశాన్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినందుకు అక్కడ ఉన్నవారందరూ ఈ పాటను హర్నాజ్‌కు అంకితం చేశారు. దీంతో తను ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి.. కన్నీళ్లు పెట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story