Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు..

స్కూళ్ల మూసివేత, పదుల సంఖ్యలో రైళ్ల రద్దు

తమిళనాడు రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు. కుండపోత వర్షంతో నిన్నమొన్నటి వరకు అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం మరోమారు ముంచెత్తుతున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2, 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. చెన్నై వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. తిరునల్వేలి, రామనంతపురం, పుడుకొట్టై, తూత్తుకుడి, శివగంగా జిల్లాల్లో నేటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని తెల్పింది. ఇక కన్యాకుమారి, తంజావూరు, తిరువరూర్‌, నాగపట్నం, మధురై, మైలాడుతురై, తెన్కాసి, విరుదునగర్ జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


కుండపోత వర్షం కారణంగా పైన నాలుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రైల్వే ట్రాకులపైకి నీళ్లు చేరడంతో పదుల కొద్దీ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు. భారీ వర్షంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత నాలుగు రాష్ట్రాలకు మంత్రులను పంపింది. అధికారులు ఇప్పటికే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు.

ఆదివారం తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం పడింది. పాళయంకోట్టైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరద బాధిత ప్రజలను షెల్టర్ క్యాంపుకు తరలించారు. షెల్టర్ హోమ్‌లోని ప్రజలు రేషన్ కోసం బారులు తీరారు. తూత్కుడి జిల్లా, తాలూకా శ్రీవైకుంటంలో ఆదివారం 525 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story