Karnataka : కర్ణాటకలో ఫ్లెక్సీల రగడ.. తాకితే చేతులు నరికేస్తామంటూ..

Karnataka : కర్ణాటకలో ఫ్లెక్సీల రగడ.. తాకితే చేతులు నరికేస్తామంటూ..
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో వీర్ సావర్కర్ పోస్టర్లను తాకితే, వారి చేతులు నరికేస్తానని హిందూ సేన నేతలుహెచ్చరించారు.

Karnataka : కర్ణాటకలో మళ్లీ రచ్చ మొదలైంది.కర్ణాటక రాష్ట్రంలో తాము అతికించిన వీర్ సావర్కర్ పోస్టర్లను తాకితే, వారి చేతులు నరికేస్తానని హిందూ సేన నేతలు తీవ్రంగా హెచ్చరించారు.తమ హిందూత్వ ఐడియాలజీకి చెందిన వీర్ సావర్కర్ పోస్టర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తే వారి చేతులు నరుకుతారని ఆయన హెచ్చరించారు.దేశం కోసం సావర్కర్ 23 ఏళ్లపాటు పోరాటం చేశారని, ఆయన ముస్లింలకు వ్యతిరేకం కాదని బ్రిటీసు వారిపై పోరాటం చేశాడని హిందుసేన నేతలు అంటున్నారు.

వీర్ సావర్కర్, బాలగంగాధర్ తిలక్ చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలోని 15వేల ప్రాంతాల్లో పెట్టి వారికి నివాళులు అర్పిస్తామని హిందు సేన నేతలు అంటున్నారు. ఇటీవలే టిప్పు సుల్తాన్‌ పోస్టర్‌ స్థానంలో వీరసావర్కర్‌ ఫ్లెక్సీ పెట్టడంపై కర్నాటక వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తాయి. మళ్లీ వీరసావర్కర్‌ వివాదం తెరపైకి రావడంతో కర్ణాటకలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు పోలీసు అధికారులు.

Tags

Next Story