
By - Vijayanand |6 July 2023 11:52 AM IST
మూత్ర విసర్జన జరిగిన గిరిజన కార్మికుడి కాళ్లు కడిగారు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. జరిగిన ఘటన బాధాకరమని తాను క్షమాపనకోరుతున్నట్లు చెప్పారు. తన అధికార నివాసంతో దశమేశ్ రావత్ ను కలిశారు చౌహాన్. క్షమాపణలు చెప్పి కాళ్లు కడిగారు. శాలువా కప్పి గౌరవించారు. ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి దశమేష్ రావత్ అనే గిరిజన కార్మికుడిపై మూత్రవిసర్జన చేశాడు.సదరు ఘటనపై చౌహాన్ సీరియస్ అయ్యారు. ఆపై బుధవారం నిందితుడి ఇంటిని కూల్చేశారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com