PM Modi : సనాతన ధర్మ నాశనమే కూటమి పన్నాగం

PM Modi : సనాతన ధర్మ నాశనమే కూటమి పన్నాగం
వారి రహస్య అజెండా భారత సంస్కృతిపై దాడేనన్న ప్రధాని

ఇండియా కూట‌మిపై ప్ర‌ధాని మోదీ విరుచుకుపడ్డారు. స‌నాత‌న ధ‌ర్మాన్నిఆ కూట‌మి అంతం చేయాల‌ని భావిస్తోంద‌ని, కానీ దానిని ఎవరు అంతం చెయ్యలేరన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన మోదీ ప్రతిపక్ష కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన్‌ను ప్రతిపక్షాలు అవమానించడం నుండి భారతదేశ విశ్వాసంపై దాడి వరకు అనేక సమస్యలను ప్రధాని లేవనెత్తారు.

స‌నాత‌న ధ‌ర్మంపై డీఎంకే మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ ఇటీవ‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. డెంగ్యూ, మ‌లేరియాతో ఆ ధ‌ర్మాన్ని పోల్చారాయ‌న‌. అయితే ఆ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను అనేక మంది ఖండించారు. తాజాగా ప్ర‌ధాని మోదీ ఇవాళ ఓ మీటింగ్‌లో ఆ అంశాన్ని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బినాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అదే సమయంలో, ప్రధానమంత్రి తన ప్రసంగంలో, భారతదేశ కూటమికి మరో ప్రత్యేక పేరును ప్రస్తావించారు. స్వామి వివేకానంద, లోక మాన్య తిలక్ వంటి ఎంతో మంది గొప్పవారికి స్ఫూర్తినిచ్చిన ‘సనాతన ధర్మాన్ని’ తుడిచి పెట్టేయాలని ప్రతిపక్ష 'ఘమండియా' (అహంకారపూరిత) కూటమి నేతలు చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేడు వారు బహిరంగంగానే సనాతన ధర్మంపై దాడికి దిగారు. రేపు మనపైనా దాడి చేస్తారు. దేశ్యాప్తంగా ఉన్న సనాతనులు అందరూ , ఈ దేశాన్ని ప్రేమించే వారు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని మనం నిలువరించాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సనాతన సంస్థను నాశనం చేయాలనుకునే కొత్త కూటమి దేశంలో ఏర్పడిందని, సనాతన ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేకపోయారని, ఎవరూ ఎప్పటికీ చేయలేరని ఈ దురహంకార కూటమి తెలుసుకోవాలన్నారు. ఈ పార్టీలకు నాయకుడిని నిర్ణయించలేదని, నాయకత్వంపై గందరగోళం ఉందని, అయితే ముంబైలో జరిగిన సమావేశంలో కూటమి ఎలా పని చేస్తుందనే దానిపై వ్యూహం రూపొందించామని ప్రధాని చెప్పారు. ఇక బీనా ప్రజలను సందర్శించేందుకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా సీఎం శివరాజ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బుందేల్‌ఖండ్‌ దేశానికి రావడమంటే నాకు ఇష్టమని చెప్పారు. ఈ రోజు బినా పెట్రో కెమికల్ కాంప్లెక్స్ శంకుస్థాపన మేక్ ఇన్ ఇండియాకు కొత్త ఊపునిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story