Private Train: దేశంలో తొలిసారిగా ప్రైవేటు రైలు సర్వీస్.. ఎక్కడి నుండి ఎక్కడ వరకు అంటే..?

Private Train: దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రైలు సర్వీస్ ప్రారంభమైంది. భారత్ గౌరవ్ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపుతుంది కేంద్రం. తొలి ప్రైవేటు రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్కు నిన్న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి వెళ్లింది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది. 20 బోగీలు కలిగిన ఈ రైలును సేలం డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ గౌతమ్ శ్రీనివాస్ ప్రారంభించారు.
తొలి రోజే ఈ రైలులో 11వందల మంది ప్రయాణించారు. తిరుప్పూరు, ఈరోడ్, సేలం, యెలహంక, ధర్మవరం, మంత్రాలయం స్టేషన్లలో ఆగింది. షిరిడి చేరుకున్నాక ప్రయాణికులకు బస్సు సదుపాయం, సాయి దేవాలయ దర్శనం తదితర ఏర్పాట్లను కూడా కల్పిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మంత్రాలయం వద్ద 5 గంటలు ఆగుతుంది. ఆ సమయంలో భక్తులు మంత్రాలయం దర్శనం చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com