Asaduddin Owaisi : పాకిస్తాన్ కవ్విస్తే భారత్ చూస్తూ ఊరుకోదు : అసదుద్దీన్ ఒవైసీ

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పా ల్పడితే భారత్ చూస్తూ ఊరుకోదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. దాయాది దేశం దాడులకు దిగితే ఇండియా వైపు నుంచి ప్రతిదాడులు మామూలుగా ఉండవన్నారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా మన దేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదంపై పోరును ప్రపంచ దేశాలకు వివరించే ప్రయ త్నంలో భాగంగా బహ్రయిన్లో పర్యటిస్తున్న ప్రతినిధి బృందంలో ఆయన ఒక సభ్యునిగా ఉన్నారు. అక్కడ పర్యటన సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ... ప్రజల్ని మతం అడిగి హత్య చేయడమంటే అది ఇస్లామిక్ బోధనలను వక్రీకరించడమేనని అన్నారు. పాకిస్తాను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆయన బహ్రెయిన్ ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com