INDIAN ARMY: సైనికులకు ఇన్‌స్టాగ్రామ్‌ అనుమతి

INDIAN ARMY: సైనికులకు ఇన్‌స్టాగ్రామ్‌ అనుమతి
X

భారత రక్షణ శాఖ తన కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను కొంతమేర సడలించింది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ఉన్న ఆంక్షల్లో మార్పులు చేస్తూ, జవాన్లు మరియు సైనికాధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ వీక్షించేందుకు అనుమతి కల్పించినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ అన్ని యూనిట్లకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

ని­బం­ధ­న­లు ఇవే.. సై­ని­కు­లు సా­మా­జిక మా­ధ్య­మా­ల­ను వి­ని­యో­గిం­చు­కో­వ­చ్చు కానీ, అది కే­వ­లం సమా­చార సే­క­రణ (Passive usage) కోసం మా­త్ర­మే­న­ని రక్షణ శాఖ స్ప­ష్టం చే­సిం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చి ప్ర­ధాన షర­తు­లు ఇక్కడ ఉన్నా­యి:

స్పం­ద­న­లు ని­షి­ద్ధం: ఇన్‌­స్టా­గ్రా­మ్‌­లో పో­స్టు­లు చే­య­డం, కా­మెం­ట్స్ పె­ట్ట­డం, వీ­డి­యో­లు షేర్ చే­య­డం లేదా మె­సే­జ్‌­ల­కు రి­యా­క్ట్ అవ్వ­డం వం­టి­వి చే­య­కూ­డ­దు.

పర్య­వే­క్షణ: ఫే­స్‌­బు­క్, ఎక్స్ (ట్వి­ట్ట­ర్), యూ­ట్యూ­బ్ వంటి ఇతర మా­ధ్య­మా­ల­కు కూడా ఇవే ని­బం­ధ­న­లు వర్తి­స్తా­యి.

భద్రత ము­ఖ్యం: నకి­లీ వె­బ్‌­సై­ట్లు, వీ­పీ­ఎ­న్‌ (VPN)లు మరి­యు వెబ్ ప్రా­క్సీ­ల­ను ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ వా­డ­కూ­డ­దు.

సమాచారం అందించాలి: ఒకవేళ తమ ఖాతాల్లో తప్పుడు సమాచారం లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

Tags

Next Story