Shubhanshu Shukla: 8న రోదసిలోకి శుభాన్షు శుక్లా

ఆక్సియోమ్ నాలుగో అంతరిక్ష వాణిజ్య మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసిలోకి వెళ్లనున్నారు. ఈ నెల 8న ఫ్లోరిడా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. తద్వారా రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, రష్యా సహకారంతో అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 40 ఏండ్ల తర్వాత మళ్లీ ఓ భారతీయుడు రోదసిలోకి వెళ్తుండటం విశేషం. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. శుక్లాతో పాటుగా పోలండ్ నుంచి స్లావోస్జ్ ఉజ్నస్కీ-విస్న్యూస్కీ, హంగరీ నుంచి టిబర్ కాపు ఐఎస్ఎస్కి వెళ్లనున్నారు.
శుక్లా ద్వారా ఇస్రో ప్రయోగం
ఈ మిషన్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ఏడు మైక్రోగ్రావిటీ ప్రయోగాలను ఎంపిక చేసింది. వీటిని దేశంలోని పలు పరిశోధన, విద్యాసంస్థల నుంచి స్వీకరించారు. ఇందులో ముఖ్యంగా ‘వాటర్ బేర్స్’ (అత్యంత చిన్న జీవులు)*పై ప్రయోగం ఉంది. మైక్రోగ్రావిటీ వాతావరణంలో జీవులు ఎలా వ్యవహరిస్తాయన్నదాన్ని అధ్యయనం చేస్తారు. ఇస్రో ప్రకారం.. ఈ అనుభవం భారత్లో మైక్రోగ్రావిటీ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుతుంది. ఇది భారత అంతరిక్ష కార్యక్రమంలో అధునాతన ప్రయోగాల దారితీస్తుంది. ఈ మిషన్ ద్వారా భారత్ మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘గగనయాన్’కు ఊతమిచ్చే అవకాశముంది. అంతేగాక, భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష మిషన్లకు ఇది బాటలు వేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com