Indigo Flight: విమానయాన సంస్థ 'ఇండిగో'కి రూ.1.2 కోట్ల జరిమానా

ఇండిగోకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం పక్కనే రన్వేపై కూర్చుని ప్రయాణికులు ఆహారాన్ని భుజించిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యి ఇండిగోకు రూ.1.20 కోట్లు, బాంబే ఎయిర్పోర్టుకు 90 లక్షల జరిమానా విధించింది. నియమాలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్టు డీజీసీఏ, బీసీఏఎస్ తెలిపింది. పైలట్ రోస్టరింగ్లో లోపాలకు ఎయిరిండియా, స్పైస్జెట్ సంస్థలకు తలా రూ.30 లక్షల జరిమానా విధించింది.
టీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని వాతావరణం అనుకూలించక ముంబైకి తిప్పడం జరిగింది. దాంతో అక్కడే ప్రయాణికులు కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్ వే పై కూర్చొని భోజనం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ముంబై ఎయిర్ పోర్టుకి ఈ విషయం గురించి రూ. 30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియో పై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పొగమంచు కమ్మేస్తుంది. ఢిల్లీతో పాటు ముంబై లాంటి ప్రాంతాల్లో కూడా పొగమంచు బాధ చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు దారి మళ్లి నడుస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొందరైతే పైలట్లు, ఎయిర్ హోస్టేస్ ల మీద దాడులు కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. విమానాలు ఆగి ఉండే స్థలంలో ప్రయాణికులు విమానం పక్కనే కూర్చొని నేల మీదే భోజనాలు చేస్తున్నారు. దానిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో పాటు అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో విమాన సంస్థ ఇండిగోకు భారీ మొత్తంలో జరిమానా విధించడం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com