Manipur Violence: ఇంటర్నెట్ బంద్, పాఠశాలలకు సెలవులు

Manipur Violence: ఇంటర్నెట్ బంద్, పాఠశాలలకు సెలవులు
మణిపూర్‭లో మళ్లీ ఉద్రిక్తతలు..

రోజులు కాదు నెలలు గడిచినా మణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్తత కాస్త కూడా తగ్గడం లేదు. అంటా బాగానే జరుగుతోంది అనుకున్న సమయంలోనే మళ్లీ ఏవో అలజడులు రగులుతున్నాయి. మణిపూర్‌లో తాజాగా వెలుగు లోకి వచ్చిన విద్యార్థుల హత్య దృశ్యాలు సంచలనం రేకెత్తించాయి. రాజధాని నగరం ఇంఫాల్‌లో వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఇంటర్నెట్ సస్పెన్షన్ మంగళవారం నుంచి ఆదివారం రాత్రి 7.45 వరకు కొనసాగుతుంది. ఐదు నెలల తర్వాత మాత్రమే రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


జూలై నుంచి మణిపూర్ నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రాలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని తరువాత, ఇంఫాల్‌లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్, స్మోక్ బాంబ్స్‌ను వాడాల్సి వచ్చింది. పోలీస్‌లు లాఠీ ఛార్జి చేయడంతో 30 మంది గాయపడ్డారని , వారిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఉరిపొక్, ఓల్డ్ లాంబులేన్, సింగ్‌జమై, తదితర ప్రాంతాల్లోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు సాగించారు. విద్యార్థుల హత్యలకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తోబాల్, కాక్‌చింగ్, బిష్నుపూర్ జిల్లాల్లో విద్యార్థులకు , భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు తలెత్తాయి. తాజా ఉద్రిక్తత నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఇంటర్నెట్ సస్పెన్షన్ మంగళవారం నుంచి ఆదివారం రాత్రి 7.45 వరకు కొనసాగుతుంది. ఐదు నెలల తర్వాత మాత్రమే రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


ఇది కాకుండా, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కూడా మూడు రోజుల పాటు మూసివేశారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈద్-ఎ-మిలాద్ కారణంగా 28 సెప్టెంబర్ ఇప్పటికే అధికారికంగా సెలవు ప్రకటించారు. మణిపూర్‌లో మే 3న రెండు వర్గాల మధ్య హింస మొదలైంది. ఆ తర్వాత అనేక రకాల ఆంక్షలు విధించారు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 175 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. క్రూరమైన నేరాల కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story