IRS Officer : సివిల్స్ చరిత్రలో తొలిసారి.. జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్

IRS Officer : సివిల్స్ చరిత్రలో తొలిసారి.. జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్
X

దేశ సివిల్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన జెండర్, పేరును మార్పించుకున్నారు. పుట్టుకతో మహిళగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రి త్వశాఖను అభ్యర్థించారు. దీంతో అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నెకి చెందిన ఐఆర్ఎస్ అధికారి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (సీఈఎస్ఏటీ) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన పేరును అనుకతీర్ సూర్యగా, జెండర్ ను మహిళకు బదులుగా పురుషుడిగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చెన్నైకి చెందిన ఐఆర్ఎస్ అధికారి అనసూయ చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 2013లో చెన్నైలో అసిస్టెంట్ 8 కమిషనర్ గా వృత్తిని ప్రారంభించిన ఐఆర్ఎస్ అధికారి అనసూయ 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంకు పదోన్నతి పొందారు. 2023లో భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్లో పీజీ డిప్లొమా చేశారు. గత ఏడాది హైదరాబాద్లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా విధుల్లో చేరారు.

Tags

Next Story