అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు అమర్ నాథ్ యాత్ర ముగిసిన తరువాత జరుగుతాయని గురువారం అర్థరాత్రి జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు షా ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర యూనిట్ నేతలకు చెప్పారు. 90 స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఆగస్టు 2019లో రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేశారు. అంతకంటే ముందు జమ్మూ & కాశ్మీర్ శాసనసభ నవంబర్ 2018లో రద్దు చేయబడింది. రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది.
రాష్ట్రంలో ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు బీజేపీ పొత్తు పెట్టుకోదని పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు తెలియజేసింది. అయితే, సీట్ల సర్దుబాట్లు మరియు "సారూప్యత కలిగిన పార్టీలతో" "ఎన్నికల అవగాహన" ఉండవచ్చని వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం. రానున్న రోజుల్లో కీలకమైన కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలోని ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని కూడా పార్టీ ప్రారంభించనుంది.
ప్రస్తుతం రవీందర్ రైనా నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ యూనిట్లో ఎలాంటి మార్పులు ఉండవని వర్గాల సమాచారం. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశానికి రైనా, జమ్మూ కాశ్మీర్కు చెందిన పార్టీ ఎంపీలు -- జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ -- ఇతర అగ్రనేతలు హాజరయ్యారు.
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఏక కాలంలో జరిగే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com