Jammu Kashmir: ఉధంపూర్‌లో రోడ్డు ప్రమాదం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి

Jammu Kashmir: ఉధంపూర్‌లో రోడ్డు ప్రమాదం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి
X
దోడా నుండి జమ్మూకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత లోడ్ క్యారియర్‌ను ఢీకొట్టాడు. ఆ బస్సులో కొంత లోపం ఏర్పడి మెకానిక్ మరమ్మతు చేస్తుండగా బస్సు అదుపుతప్పింది.

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం బస్సు ఆగి ఉన్న రోడ్డు క్యారియర్‌ను, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సిఆర్‌పిఎఫ్ జవాన్ సహా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జఖాని-చెనాని ప్రాంతం సమీపంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దోడా నుండి జమ్మూకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడని, ఆ తర్వాత లోడ్ క్యారియర్‌ను ఢీకొట్టాడు. దాంతో క్యారియర్‌లో కొంత లోపం ఏర్పడిందని, దానిని మెకానిక్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.

ఈ ప్రమాదంలో మెకానిక్ మరియు లోడ్ క్యారియర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యవసర కిటికీలోంచి బయటకు దూకడంతో గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని అధికారి తెలిపారు.

Tags

Next Story