Lok Sabha Elections: కొనసాగుతున్న పోలింగ్ , ఐదో దశ పోలింగ్లో ఓటేసిన ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికలకు ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టార్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్ , జాన్వీ కపూర్ , రాజ్కుమార్ రావ్, ఐరా ఖాన్, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, షాహిద్ కపూర్ సహా పలువురు తారలు ఓటేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇక బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఓటేశారు. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్, గతేడాది ఆగస్టు 2023లో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మొదటిసారి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక ఐదో దశలో ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది.
పోలింగ్ బూత్ల వద్ద సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో ఓటింగ్ జరిగేలా తగిన నీడ, తాగునీరు, ర్యాంపులు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించినట్లు ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఈవోలు, డీఈఓలు, ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు.
ఐదో దశ ఓటింగ్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదో దశలో అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాయ్బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, ఆర్జేడీ నేత, పార్టీ అగ్రనేత, బీహార్ మాజీ చీఫ్ కుమార్తె కరణ్ భూషణ్ సింగ్ ఐదో దశలో పోటీ చేస్తున్నారు. మంత్రి లాలూ ప్రసాద్ సరన్ నుంచి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, చిరాగ్ పాశ్వాన్ హజీపూర్ నుంచి, లాకెట్ ఛటర్జీ బారాముల్లా నుంచి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com