జస్టిస్ యశ్వంత్ వర్మ నగదు వివాదం..దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల ప్యానెల్..

X
By - Prasanna |12 Aug 2025 12:35 PM IST
జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్ను సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం నుండి భారీ నగదు దొరికినందున ఆయనపై అభిశంసనకు 146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ఆమోదించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్ను సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. ఆయన నివాసం నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై అభిశంసన ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ కమిటీ విచారణకు ఏర్పాటు చేశారు.
ముగ్గురు సభ్యుల ప్యానెల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీందర్ మోహన్ మరియు సీనియర్ న్యాయవాది బి.వి.ఆచార్య ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com