Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు (జనవరి 22) తెల్లవారుజామున కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉత్తర కన్నడ జిల్లాలోని అరబైల్ ఘాట్ లోని కాగేరి పెట్రోల్ బంక్ సమీపంలో NH-63పై కూరగాయలు, పండ్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాద సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్రక్కు హవేరి నుంచి కుంటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదంలో గాయపడిన 15 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com