Karnataka : కర్నాటక కాంగ్రెస్కు షాక్.. డీకే శివకుమార్కు ఈడీ నోటీసులు..
By - Sai Gnan |15 Sep 2022 12:01 PM GMT
Karnataka : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు
Karnataka : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న డీకే శివకుమార్.. తన రాజ్యాంగ, రాజకీయ బాధ్యతలను నిర్వర్తించేందుకు సమయం అడ్డు వస్తోందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలతోపాటు మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో అడుగుపెట్టనున్న పార్టీ భారత్ జోడో యాత్ర మధ్య నోటీసులు వచ్చాయని తెలిపారు. ఈడీ కావాలనే నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తాను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా.. విధులు నిర్వర్తించకుండా తనను ఈడీ వేధిస్తోందంటూ ట్వీట్ చేశారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com