మంత్రి కాలినడకన శ్రీవారి దర్శనం.. స్వామి కరుణిస్తే..
తిరుపతికి కాలినడకన వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి 2014 నుండి 2016 వరకు కర్ణాటక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న జోషి నేడు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆయన కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 నియోజకవర్గాలకు 10వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఓట్ల లెక్కింపునకు ముందు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కేంద్ర మంత్రి కాలినడకన స్వామి దర్శనానికి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని జోషి కాలినడకన వెళ్లి సామీ దర్శనం చేసుకున్నారని అంటున్నారు. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే జోషికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సెక్యులర్ జనతాదళ్ పార్టీ యోచిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కుమారస్వామి అన్నారు.
కానీ మంత్రి దీనిని ఖండించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే పని చేయాలని ఉందని అన్నారు. ప్రజలు, దేవుడు ఆశీర్వదించినంత కాలం కేంద్ర మంత్రివర్గంలో ఉండాలని కోరుకుంటున్నట్లు జోషి తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com