Petrol Prices Hike : పెట్రో బాంబ్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం

Petrol Prices Hike : పెట్రో బాంబ్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం
X
రూ. 3 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకంది. ఈ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగగా.. లీటర్ డీజిల్ ధర రూ. 3.02 పెరిగింది. కర్ణాటక సేల్స్ ట్యాక్స్ పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచినట్లు ప్రభుత్వ నోటిఫికేషన్ వెల్లడించింది. దీంతో ప్రజలపై అదనపు భారం పడనుంది. కాగా, సేల్స్ ట్యాక్స్ పెంచుతూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం బట్టబయలైందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఉందని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, ఆపై కాంగ్రెస్ పార్టీ, సొంత రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని తెలిపారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు వ్యతిరేక, సామాన్యుడి వ్యతిరేక ఉత్తర్వు, ఫత్వా, జిజియా పన్నును ఆమోదించారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న అమ్మకపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం సవరించడంతో ఇంధన ధర పెరిగిందని పెట్రోలియం డీలర్ల సంఘం పేర్కొంది. బెంగళూరులో లీటరు ధర రూ. 99.84 నుంచి రూ. 102.84కి పెరిగింది. అదే విధంగా డీజిల్ ధర రూ.3.02 పెరగడంతో లీటరు ధర రూ.85.93 నుంచి రూ.88.95కి పెరిగింది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంధన ధరల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,500 నుంచి రూ.2,800 కోట్ల వరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Tags

Next Story