KCR: భవిష్యత్తులో ఆ సంచలనాన్ని చూడబోతున్నారు- సీఎం కేసీఆర్

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సంచలనం జరగబోతోందని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి సర్వోదయ స్కూల్ను సందర్శించిన ఆయన.. ఢిల్లీ తరహా ఎడ్యుకేషన్ పాలసీ దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. విద్య విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేసీఆర్ కొనియాడారు. ఢిల్లీకి తెలంగాణ టీచర్ల బృందాన్ని పంపిస్తామని తెలిపారు. కేంద్ర తీసుకొస్తున్న నూతన విద్య, విధానాలు ఏకపక్షంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.
అంతకుముందు యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ తీరుపై ఇద్దరు నేతలు చర్చించారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని మరోసారి చెప్పిన కేసీఆర్.. ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. దేశంలో తీసుకురావాల్సిన మార్పులు, అనేక అంశాలపై నేతలందరితో చర్చిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com