KEJRIWAL: అధికారం ఇండియా కూటమిదే

దేశం దిశ, దశను మార్చడానికి జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారి కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ రోడ్ షో... నిర్వహించారు. జూన్4న చారిత్ర్మాక ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని. ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. చరిత్ర మలుపు తిరగబోతుందని బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ భవిత్యం మారిపోతుందన్నారు. తాను నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని తనకు ప్రజలకు మద్దతు కావాలని అభ్యర్థించారు. దేశం ఎప్పుడూ ఏ నియంతను అంగీకరించలేదని అలాంటి వారిని అధికారం నుంచి తొలగించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతిచోట్ల బీజేపీ ఓడిపోతుందని ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీలో 75 ఏళ్లు వచ్చిన వారు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నియమం పెట్టిన మోదీ... అమిత్ షాను ప్రధానిని చేసేందుకే ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని కేజ్రివాల్ ఆరోపించారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పడబోదని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేజ్రివాల్ .. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ జైలులో పెడుతుందని ఆరోపించారు. జూన్ 4తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. హరియాణ, రాజస్థాన్, బిహార్ , యూపీ, ఢిల్లీ, కర్ణాటక,పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లలో NDA గెలిచే స్థానాలు. గణనీయంగా తగ్గిపోతాయని జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుందన్న కేజ్రివాల్ నియంతకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు చెప్పారు. తనకు..140 కోట్ల మంది ప్రజలు అండగా నిలవాలని కోరారు.
బీజేపీ కౌంటర్
నరేంద్ర మోదీ మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అవుతారని..అధికార బీజేపీ నొక్కి చెప్పింది. వచ్చే ఏడాదితో మోదీకి 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు ఆయన పదవీ విరమణ చేస్తారన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొట్టారు.మోదీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీకి 75 ఏళ్లు... వస్తున్నందుకు సంతోషించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ , ఇండియా కూటమికి చెప్పారు. మోదీ ప్రధాని కాలేరని బీజేపీ రాజ్యాంగంలో లేదని.... 2029 వరకు దేశాన్ని ఆయనే నడిపించనున్నారని షా అన్నారు. దేశ ప్రజలు మోదీ వైపు ఉన్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి నేతలు మోదీ వయస్సును ఒక సాకుగా ఉపయోగిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఓటమి భయంతో విపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com