Kejriwal : బీజేపీ ఎంత విమర్శిస్తే.. గుజరాత్లో మాకు అంత బలం పెరుగుతుంది : కేజ్రీవాల్
By - Divya Reddy |1 Sep 2022 2:30 PM GMT
Kejriwal : విశ్వాస పరీక్షలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెగ్గారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయనకు 59 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు
Kejriwal : విశ్వాస పరీక్షలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెగ్గారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయనకు 59 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేజ్రీవాల్.. ఆపరేషన్ లోటస్ విఫలమైందన్నారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించిన బీజేపీ సక్సెస్ కాలేదన్నారు.
అంతేకాదు.. ఆప్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని తేల్చి చెప్పారు కేజ్రీవాల్. సిసోడియాపై ఆరోపణలు చేసేకొద్దీ గుజరాత్లో బలం పెరుగుతోందని జోస్యం చెప్పారు. ఇక ఇలానే ఆరోపణలు చేస్తూ ఉంటే.. గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు కేజ్రీవాల్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com