kerala: కేరళలో పతాకస్థాయికి ముక్కోణపు పోరు

kerala: కేరళలో పతాకస్థాయికి ముక్కోణపు పోరు
మరోసారి విజయమే లక్ష్యంగా యూడీఎఫ్‌... సత్తా చాటాలని చూస్తున్న ఎల్‌డీఎఫ్‌, బీజేపీ

సార్వత్రిక ఎన్నికల సమరంలో 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని NDA ప్రణాళికలను రచిస్తోంది. కమల దళం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 50 స్థానాలను NDA కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రధాని మోదీ దక్షిణాదిన సుడిగాలి ప్రచారం చేస్తూ....... ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాదిన NDA వికాసం కనిపిస్తున్నా దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలు భాజపాకు కొరకరాని కొయ్యగా మారాయి. అందులో ముఖ్యమైన రాష్ట్రం కేరళ. కేరళలో దశాబ్దాలుగా వామపక్షాల నేతృత్వంలోని LDF... కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేరళలో సత్తా చాటి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ కూటములు. వ్యూహ రచన చేస్తున్నాయి.

కేరళలోని మొత్తం ఓటర్లలో 50 శాతం మంది మైనార్టీ వర్గాలకు..... చెందిన వారు ఉన్నారు. ఈ ఓట్లతో కేరళలో విజయం సాధించేందుకు UDF ప్రణాళికలు రచిస్తోంది. UDFలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML కూడా భాగస్వామ్యంగా ఉంది. యూత్‌ కాంగ్రెస్‌, IUML..సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశాయి. ఈ అంశాలు కాంగ్రెస్‌కు కలిసిరానున్నాయి. కానీ కాంగ్రెస్‌ కేరళ చీఫ్‌ సుధాకరన్‌, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ల మధ్య వర్గ విభేదాలు సమన్వయ లోపం స్థానిక నేతలు భాజపాలో చేరడం వంటి అంశాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి.... కేరళలోని మొత్తం 20 స్థానాలకుగానూ 19 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో UDF కూటమి విఫలమైంది.

ఈసారి త్రిసూర్‌లో మినహా దాదాపు అందరు సిట్టింగ్‌ ఎంపీలను UDF బరిలోకి దించగా, లెఫ్ట్‌ పార్టీ... సీనియర్‌ నేతలైన కె.కె. శైలజ, థామస్‌ ఐజాక్‌, ఎలమరామ్‌ కరీంలను రంగంలోకి దింపింది. 2019 ఎంపీ ఎన్నికల్లో వయానాడ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ బరిలో నిలవడం UDFకు..... బలం చేకూర్చింది. ఇటీవల.. పుత్తుపల్లి, త్రిక్కకర అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు... భారీ విజయం సాధించడం కూడా హస్తం పార్టీ బలాన్ని... మరింత పెంచింది. 2016 నుంచి కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు కలిసిరానుంది. కాంగ్రెస్‌కు మైనారిటీల్లో బలమైన ఓటు బ్యాంక్‌ ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర ఆరోపణలు కూడా హస్తం పార్టీకి కలిసిరానున్నాయి. అయితే మహిళలకు సీట్లు కేటాయించకపోవడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. మొత్తం 20 స్థానాలు ఉండగా కేవలం ఒకే సీటును UDF మహిళకు కేటాయించింది. ఎన్నికలకు ముందు స్థానిక కాంగ్రెస్ నేతలు భాజపాలోకి ఫిరాయించడం కూడా కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story